ఖైదీతో లాభం లేదు.. దొంగకు బజ్ లేదు

తమిళ హీరో కార్తీ ఇటీవల నటించిన ఖైదీ సినిమా తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసే వరకు కూడా హౌజ్‌ఫుల్ షోలతో నడిచిందంటే సినిమా కంటెంట్ ప్రేక్షకులకు ఎంతమేర నచ్చిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

కానీ ఈ సినిమా సక్సెస్ హీరో కార్తీకి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది.ఖైదీ సినిమా తరువాత కార్తీ నటించిన తాజా చిత్రం దొంగ.

పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జ్యోతిక కూడా కీలకపాత్ర పోషిస్తోంది.ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమాకు చాలా దారుణమైన బజ్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియదు.దొంగ అనే సినిమా రేపు వస్తున్నట్లు కూడా తెలుగు జనాలకు తెలియదంటే ఈ సినిమా ప్రమోషన్స్‌ ఏస్థాయిలో జరిగాయో అర్ధం అవుతోంది.

Advertisement

జీతు జోసెఫ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రతిరోజూ పండగే, రూలర్ సినిమాలు ఇచ్చే పోటీని ఎంతవరకు తట్టుకుంటుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.అయితే దొంగ చిత్రాన్ని రిలీజ్ చేసే సమయం ఇది మాత్రం కాదని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు