అక్షయ్ కుమార్ రహస్యంగా ఫోన్ చేశాడంటున్న కంగనా

ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సెలబ్రిటీలు అందరూ ఓ వైపు ఉంటే కంగనా రనౌత్ ఆమె సపోర్టర్స్ అందరూ ఓ వైపు ఉండి పోయారు.

దీంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది.

సెలబ్రిటీ కుటుంబాలు వారితో సినిమా చేసే బ్యాచ్ మొత్తం కంగనా రనౌత్ ని ఓ విధంగా బాయ్ కాట్ చేసారని చెప్పాలి.అయితే బాలీవుడ్ మీద పెత్తనం చేసే ఆ వర్గం వారికి కంగనా రనౌత్ ఏదో ఒక రూపంలో పంచ్ లు వేస్తూ చాలా ఇబ్బందికి గురి చేస్తుంది.

ఏ మాత్రం అవకాశం దొరికిన వారి మీద విమర్శల దాడి చేస్తుంది.బాలీవుడ్ లో తనకంటే గొప్ప నటి లేదని ఆ మధ్య చాలా గర్వంగా కంగనా రనౌత్ ప్రకటించుకుంది.

అయితే ఈ భామ ఎన్ని చేసిన కూడా సెలబ్రిటీ వారసులు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.ఆమె నోట్లో నోరు పెట్టడం ఎందుకని మౌనంగానే ఆమె విమర్శలని భరిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే కంగనా రనౌత్ లీడ్ రోల్ చేసిన జయలలిత బయోపిక్ తలైవి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

కంగనా రనౌత్ జయ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్లు ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.తెరపై అద్బుతమైన ఎమోషన్స్ ని కంగనా రనౌత్ పలికించిందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ కొంత మంది సీక్రెట్ గా నాకు ఫోన్ చేసి తలైవిలో నా పెర్ఫార్మెన్స్ బాగుందని ప్రశంసిస్తున్నారని కంగనా రనౌత్ టాప్ సీక్రెట్ బయట పెట్టింది.అక్షయ్ కుమార్ ఫోన్ చేసి తలైవి ట్రైలర్ బాగుందని ప్రశంసించారని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

అయితే బాలీవుడ్ పెద్ద మాఫియా ఉందని, ఆ మాఫియాకి భయపడి ఎవరూ కూడా ధైర్యంగా బహిరంగంగా చెప్పలేకపోతున్నారని కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బి-టౌన్ లో సంచలనంగా మారాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు