'మహర్షి' వచ్చే వరకు దెయ్యం వదిలేలా లేదుగా..!

రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన లారెన్స్‌ కాంచన 3 చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతూ ఉంది.

ఇప్పటికే 100 కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఎవెంజర్స్‌ వచ్చిన తర్వాత ఈ చిత్రం వసూళ్లు తగ్గుతాయని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఈ చిత్రంకు కలెక్షన్స్‌ ఏమాత్రం తగ్గలేదు.

తెలుగు రాష్ట్రాల్లోని బి, సి క్లాస్‌ ఆడియన్స్‌ నుండి భారీ మొత్తంలోనే వసూళ్లు వస్తున్నాయి.లారెన్స్‌ నటించిన కాంచన 3 చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.ఇక నైజాం ఏరియాలో కనీ విని ఎరుగని విధంగా ఈ చిత్రం ఏకంగా 5.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేయడం జరిగింది.నైజాం ఏరియాల్లో ఈ చిత్రం కేవలం రెండు కోట్లకు అమ్ముడు పోయింది.ఆ రెండు కోట్లను రాబట్టడం గగనం అనుకుంటున్న సమయంలో ఏకంగా 5.5 కోట్ల రూపాయల షేర్‌ను రాబట్టి ఔరా అనిపించుకుంది.చిన్న హీరోల డైరెక్ట్‌ సినిమాలు కూడా ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టలేవు.

కాని ఈ చిత్రం మాత్రం ఇంత భారీగా వసూళ్లను రాబట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.తప్పకుండా ఈ చిత్రం మరింతగా వసూళ్లను రాబడుతాయని ఆశిస్తున్నారు.

Advertisement

ఈనెల 9వ తారీకున మహర్షి చిత్రం రాబోతుంది.అప్పటి వరకు కాంచన 3 చిత్రం దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్లు లాభాల్లో నడుస్తున్నాయి.మొత్తానికి అన్ని విధాలుగా లారెన్స్‌ లక్కీగా ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు