బీజేపీ నుంచి సస్పెండ్ చేయడంపై జిట్టా ఆగ్రహం

బీజేపీ నుంచి సస్పెండ్ చేయడంపై జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా రాష్ట్ర కార్యదర్శి సభ్యుడి పదవి నుంచి బీజేపీ జిట్టాను తొలగించింది.

ఈ నేపథ్యంలో పార్టీలో చురుకైన పాత్ర పోషించిన తనను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.సస్పెండ్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారన్న ఆయన వారం రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు.

అయితే తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియనప్పుడు ఏమని వివరణ ఇవ్వాలో వాళ్లే చెప్పాలన్నారు.తానేమీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు.

ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే పది ప్రశ్నలతో బీజేపీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

Advertisement
ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 

తాజా వార్తలు