బిగ్ బాస్ లో అలాంటి వాళ్లకే ఓట్లు పడతాయా..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 గత సీజన్లలా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే సంగతి తెలిసిందే.

ప్రేక్షకులకు అంతోఇంతో పరిచయం ఉన్న కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా ఎవరికీ తెలియని కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారు.

అయితే బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ అయిన కంటెంస్టెంట్ల జాబితాను పరిశీలిస్తే ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.ప్రేక్షకులు టాస్కుల కంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్లకు, ఎమోషనల్ అయ్యేవాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

నిజానికి ఆదివారం రోజున ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మెహబూబ్ బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ ను బాగా ఆడాడు.అయితే టాస్క్ ల సమయంలో తప్ప మిగతా సమయాల్లో మెహబూబ్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించలేకపోయాడు.

దీంతో పాటు బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాకులు కూడా కంటెస్టెంట్లను చివరి వరకు ఉంచుతాయని అర్థమవుతోంది.నిజానికి మోనాల్ ను కూడా లవ్ ట్రాకులే రక్షిస్తున్నాయని తెలుస్తోంది.

Advertisement

ప్రేక్షకులు బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు.బిగ్ బాస్ నిర్వాహకులు సైతం టీఆర్పీ రేటింగ్ ను దృష్టిలో ఉంచుకుని కొందరు కంటెస్టంట్లను కాపాడుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో కొందరు కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇవ్వ నున్నారని వార్తలు వస్తున్నా తెలుస్తున్న సమాచారం మేరకు రీఎంట్రీలు లేవని తెలుస్తోంది.

గత సీజన్లలా హిట్ కాకపోవడం, బిగ్ బాస్ షో రేటింగులు సాదాసీదా సీరియళ్ల రేటింగుల కంటే తక్కువగా ఉండటంతో బిగ్ బాస్ సీజన్ 5 ఉండకపోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.బిగ్ బాస్ సీజన్ 3 ని సక్సెస్ చేసిన నాగార్జున కంటెస్టెంట్ల ఎంపికలోని లోపాల వల్ల, ఇతర కారణాల వల్ల ఈ సీజన్ ను మాత్రం సక్సెస్ చేయలేపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు