విజయనగరం జిల్లా గజపతినగరంలో తీవ్ర ఉద్రిక్తత

విజయనగరం జిల్లా గజపతినగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నిన్న ఎం.

కొత్తవలసకు చెందిన కంకణాల శ్రీను అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.

అయితే ఎస్ఈబీ పోలీసులు దాడి చేయడం వలనే శ్రీను మృతిచెందాడని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అక్రమ మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ శ్రీనుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు.ఈ మేరకు రోడ్డుపై గ్రామస్తులు బైటాయించి నిరసనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు