లండన్లో విషాదం చోటు చేసుకుంది.గుర్తు తెలియని దుండుగుల చేతిలో దాడికి గురైన 37 ఏళ్ల భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.లండన్లోని హేస్ ప్రాంతానికి చెందిన బల్జీత్ సింగ్ శనివారం రాత్రి స్టేషన్ రోడ్లో గుర్తు తెలియని వారి చేతిలో దాడికి గురయ్యాడు.
తీవ్రగాయాలతో పడివున్న బల్జీత్ సింగ్ను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు లండన్ అంబులెన్స్ సర్వీస్కు సమాచారం అందించారు.అయితే అతను అప్పటికే మరణించాడు.బల్జీత్ సింగ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన తర్వాత విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపారు.లండన్ ఫుల్హామ్ మార్చురీలో జరిగిన పోస్ట్మార్టంలో ఆయన మరణానికి కారణం మెడ వెనుక గాయంగా తెలుస్తోంది.
ఈ కేసుపై మెట్రోపాలిటిన్ పోలీస్లోని స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ విభాగం దర్యాప్తు చేస్తోంది.విచారణలో భాగంగా ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.ప్రాథమిక అంచనా ప్రకారం బల్జీత్సింగ్తో పాటు వున్నవారే ఆయనపై దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ప్రస్తుతం వారిద్దరూ ఎవరు.
శనివారం రాత్రి పది గంటల సమయంలో ఏం జరిగిందనే దానిపై మెట్రోపాలిటిన్ పోలీస్ విభాగం ఆరా తీస్తోంది.