లండన్‌లో భారత సంతతి వ్యక్తిపై దుండగుల దాడి, మృతి

లండన్‌లో విషాదం చోటు చేసుకుంది.గుర్తు తెలియని దుండుగుల చేతిలో దాడికి గురైన 37 ఏళ్ల భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

 London, Hayes, Baljeet Singh, Metropolitan Police, Fulham Mortuary, Postmortem-TeluguStop.com

స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.లండన్‌లోని హేస్ ప్రాంతానికి చెందిన బల్జీత్ సింగ్ శనివారం రాత్రి స్టేషన్ రోడ్‌లో గుర్తు తెలియని వారి చేతిలో దాడికి గురయ్యాడు.

తీవ్రగాయాలతో పడివున్న బల్జీత్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు లండన్ అంబులెన్స్ సర్వీస్‌కు సమాచారం అందించారు.అయితే అతను అప్పటికే మరణించాడు.బల్జీత్ సింగ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన తర్వాత విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపారు.లండన్‌ ఫుల్‌హామ్‌ మార్చురీలో జరిగిన పోస్ట్‌మార్టంలో ఆయన మరణానికి కారణం మెడ వెనుక గాయంగా తెలుస్తోంది.

ఈ కేసుపై మెట్రోపాలిటిన్ పోలీస్‌లోని స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ విభాగం దర్యాప్తు చేస్తోంది.విచారణలో భాగంగా ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.ప్రాథమిక అంచనా ప్రకారం బల్జీత్‌సింగ్‌తో పాటు వున్నవారే ఆయనపై దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ప్రస్తుతం వారిద్దరూ ఎవరు.

శనివారం రాత్రి పది గంటల సమయంలో ఏం జరిగిందనే దానిపై మెట్రోపాలిటిన్ పోలీస్ విభాగం ఆరా తీస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube