సాధారణంగా చాలా మంది శనగలు నాన బెట్టిన నీటిని బయట పారబోసేస్తుంటారు.ఆ నీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్న భావనే అందుకు కారణం.
అయితే నిజానికి శనగలే కాదు అవి నాన బెట్టిన నీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ప్రయోజనాలనూ అందిస్తాయి.
మరి ఆలస్యం చేయకుండా శనగలు నానబెట్టిన నీటి వల్ల వచ్చే లాభాలు ఏంటీ ? అసలు శనగలు నానబెట్టిన నీటిని ఎలా తీసుకోవాలి ? అన్న విషయాలపై ఓ లుక్కేసేయండి.
ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే బరువును తగ్గించడంలో శనగలు నానబెట్టిన నీరు అద్భుతంగా సహాయపడుతుంది.అవును, హెవీ వెయిట్ ఉన్న వారు ఒక కప్పు శనగలను శుభ్రంగా కడిగి ఆ తర్వాత వాటర్లో వేపి ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
అనంతరం నీటిని మాత్రమే తీసుకుని అందులో చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని సేవించాలి.ఇలా రోజుకు ఒక కప్పు చప్పున తీసుకుంటే.
వేగంగా బరువు తగ్గుతారు.
శనగలను నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.అందు వల్ల, మధుమేహం వ్యాధి గ్రస్తులు ఈ నీటిని సేవిస్తే మంచిద అలాగే రోగ నిరోధక వ్యవస్థను బలపరచడంలోనూ ఈ నీరు ఉపయోగపడుతుంది.ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ శనగలను నాన బెట్టిన నీటిని తాగితేఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది.
దాంతో వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి.
ఇక శనగలు నాన బెట్టిన నీటిని సేవించడం వల్ల.
మలబద్ధకం దూరం అవుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.
చర్మం సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.అంతేకాదు, ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడే వారు శనగలతో పాటుగా శనగలు నాన బెట్టిన నీరు కూడా తీసుకోవాలి.
తద్వారా ప్రోటీన్ కొరత పరార్ అవుతుంది.