ప్రస్తుతం ఒక్క మెడల్ గెలిస్తే చాలు కోట్ల రూపాలయ నజరానాలు అందిస్తూ.ఆహా ఓహో అంటున్నారు.
వారికే పలు కంపెనీలు స్పాన్సర్ షిప్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాయి.కానీ మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యాలను మాత్రం పట్టించుకోవడం లేదు.
క్రికెట్ లాంటి గ్లామర్ క్రీడలకే తప్ప.మామూలు ఆటలను.
ఆ ఆటల్లో పతకాలు సాధించిన ఆటగాళ్లనకు అస్సలు పట్టించుకోవడం లేదు.ఒకప్పుడు ఆయా క్రీడల్లో ఛాంపియన్లుగా నిలిచిన వారు ఇప్పుడు బతుబండి లాగడం కోసం రోజువారి కూలీలుగా మారిపోయారు.
ఒకప్పుడు వెలుగు వెలిగి.ప్రస్తుతం దయనీయ స్థితిలో జీవితం గడుపుతున్న ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
*ఆషా రాయ్
ఒకప్పుడు ఈమె 100, 200 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో ఎన్నో బంగారు పతకాలు సాధించింది.ప్రస్తుతం బతకడం కోసం కూరగాయలు అమ్ముకుంటుంది.
*సీతా సాహు

జాతీయ స్థాయి పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించిందన ఈ క్రీడాకారిణి ప్రస్తుతం పానీపూరీ బండి నడుపుతోంది.
*రష్మిత పాత్రా

భారత మహిళా ఫుట్ బాల్ టీమ్ లో మెంబర్ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం పాన్ డబ్బా నడుపుతూ బతుకెళ్లదీస్తుంది.
*భరత్ కుమార్

పారాలంపిక్ స్విమ్మింగ్ లో భారత్ కు సుమారు 50 పతకాలు తెచ్చాడు.ప్రస్తుతం ఆయన కార్లను వాష్ చేస్తూ జీవిస్తున్నాడు.
*శాంతీ దేవి

కబడ్డీ ఛాంపియన్ అయిన శాంతీ దేవి.ప్రస్తుతం కూరగాయలు అమ్ముతూ పిల్లల్ని పోషిస్తుంది.
*నిషా రాణీ దత్తా

ఒకప్పటి ఈ ఆర్చరీ చాంపియన్.ప్రస్తుతం రోజువారీ కూలీగా పనిచేస్తుంది.
*రాజ్ కుమార్ తివారీ

వింటర్ ఒలంపిక్స్ స్కేటింగ్లో భారత్కు బంగారు పతకం తెచ్చిన రాజ్ కుమార్ ప్రస్తుతం రోడ్డుపక్కన వస్తువులు అమ్ముతూ జీవిస్తున్నాడు.
*శాంతి సౌందరాజన్

ట్రాక్ ఫీల్డ్ అథ్లెటిక్స్ 800 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం సాధించిన ఈ క్రీడాకారిణి ప్రస్తుతం రోజువారీ కూలీగా మారింది.
*నారి ముండు

భారత మహిళా హాకీ జట్టు తరఫున 19 మ్యాచ్ లు ఆడిన నారి మండు.ప్రస్తుతం వ్యవసాయ కూలీగా మారింది.
*బిర్ బహాదూర్

ఒకప్పటి ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్. ప్రస్తుతం పానీ పూరీ అమ్ముతున్నాడు.
*సంధ్యా రాణి సింఘా

ఫెన్సింగ్ చాంపియన్ షిప్ జాతీయ స్థాయి టోర్నమెంట్లలో బ్రాంజ్ మెడల్స్ పొందిన ఈమె ప్రస్తుతం కూలీగా మారింది.
*సర్వాన్ సింగ్

ఒకప్పటి ఏషియన్ గేమ్స్ అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన ఈ క్రీడాకారుడు ప్రస్తుతం దయనీయ స్థితిలో జీవిస్తున్నాడు.