విశాఖపట్నం జిల్లాలో వరుసగా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి.మూడు రోజుల క్రితం HPCL లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా తాజాగా సింహాచలం ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
సింహాచలం ఆర్ఆర్ వెంకటాపురం ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగి అర్ధరాత్రి భారీ శబ్ధంతో పేలిపోయాయి.దీంతో సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు హడలిపోయారు.
పేలుడు దాటికి మంటలు భారీగా ఎగసి పడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి.
అర్ధరాత్రి దాటాక భారీగా శబ్దాలతో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతో చుట్టుపక్కల ప్రజలు ఏం జరుగుతుందో అని హడలిపోయి ఇంటిలో నుండి బయటకు పరిగెత్తారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.ఈ పరిణామంతో సింహాచలం పరిసర ప్రాంతాల్లో కొంతసేపు పవర్ కట్ ఆగిపోయింది.మంటలు భారీగా చెలరేగటంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి రెండు ఫైరింజన్లు ద్వారా మంటలను అదుపులోకి తీసుకు రావటం జరిగింది.