ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరున రిటైర్ అవుతున్నారు.దీంతో అక్టోబర్ మొదటి తారీకు నుండి.
రాష్ట్రానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా.ఐఏఎస్ డాక్టర్ సమీర్ శర్మ నీ నియమిస్తూ… రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అక్టోబర్ మొదటి తారీకు నుండి ఆదిత్యనాథ్ స్థానంలోకి ఐఏఎస్ డాక్టర్ సమీర్ శర్మ విధుల్లోకి రానున్నట్లు.ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
1985 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆప్కో, ఐటిడిసి సిఎండి గా పనిచేసిన అనుభవం ఉంది.ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా సమీర్ శర్మ విధుల్లో ఉన్నారు.అక్టోబర్ మొదటి తారీకు నుండి ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే లా తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.