టీపీసీసీకి అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంటున్న పరిణామాలు ఆ పార్టీ నేతలకే మింగుడుపడం లేదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజు రోజుకి తెలంగాణాలో బలహీనం అవుతుండడంతో బలం పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అయినా భవిష్యత్తుపై ఆ పార్టీ నేతల్లో నమ్మకం లేకపోవడంతో ఒక్కొక్కరూ పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా తెలంగాణాలో పార్టీని పరుగులు పెట్టించేందుకు పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో ఉంది.

ఇది ఇలా ఉండగానే ఈ రోజు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు.కొద్ది రోజుల్లో తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నాను అంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు.

హుజూర్‌నగర్ సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన చెబుతున్నా ఎలాగూ మరికొద్ది రోజుల్లో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉండే అవకాశం ఉండడంతో ముందుగానే ఆయన రాజీనామా చేయాలని చూస్తున్నట్టు అర్ధం అవుతోంది.

Advertisement
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తాజా వార్తలు