గుంటూరు జిల్లాకు చెందిన అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్‌ రషీద్ ను అభినందించిన హోంమంత్రి సుచరిత..

రషీద్ లోని టాలెంట్ తో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే క్రికెట్లో ఉన్నత స్థాయికి చేరుకున్నాడని హోంమంత్రి సుచరిత అన్నారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పాత మల్లాయపాలెంకు చెందిన రషీద్ వరల్డ్ కప్ గెలిచిన అండర్-19 వరల్డ్ కప్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

అతని ఆట తీరుపై పలువురు ప్రశంసలు గుప్పించారు.ఈ నేపథ్యంలోనే రషీద్ తండ్రి బాలీషా గుంటూరులోని హోంమంత్రి నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ రషీద్ కు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వకపోయిన క్రికెట్లో ఉన్నత స్థాయికి చేరుకున్నాడన్నారు.అతను ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత సిఎంతో సమావేశం అయ్యేలా ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామన్నారు.అతను మా నియోజకవర్గానికే జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడన్నారు.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు