"లేడీ" గా రాబోతున్న హీరోయిన్ మాధవిలత...!

అతిథి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి మాధవిలత.ఆ తర్వాత నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా నటించింది.

ఈ హీరోయిన్ సినిమాల్లో తన సోషల్ మీడియాలో ఎక్కువగా తన అభిమానులని పలకరిస్తూ ఉంటుంది.ఇక నచ్చావులే సినిమా తర్వాత.

ఆవిడ టాలీవుడ్ లో స్నేహితుడు, అరవింద్ 2 లాంటి సినిమాలలో నటించింది.నటించిన ఆవిడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

దీంతో సినిమాల్లో అవకాశం రాలేక ఇబ్బందులకు గురైన తర్వాత, ఆవిడ రాజకీయాల వైపు మొగ్గు చూపింది.దీంతో ఆవిడ మొదటగా నా భారతీయ జనతా పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

అప్పటినుండి తనదైన శైలిలో రాజకీయపరంగా తన మార్కును చూపిస్తూ ముందుకు సాగింది.అయితే తనకి ఇష్టమైన సినిమా ఇండస్ట్రీని మరోసారి పలకరించబోతోంది.

అయితే ఈసారి మాత్రం సోలో పర్ఫామెన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి కళ్యాణ్ డైరెక్షన్ లో రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషన్ డ్రామాగా సినిమాను రూపొందించబోతున్నారు.ఇక ఈ సినిమాకు లేడీ అనే టైటిల్ ని ఎంచుకున్నారు.

మోనో ప్లే ఎక్స్పరిమెంట్ సినిమాని చరణ్ క్రియేషన్ పై సత్యనారాయణ,కళ్యాణ్ నిర్వహించబోతున్నారు.సినిమా అమాంతం కేవలం ఒక క్యారెక్టర్ తోనే తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలియజేశారు.

ఈ సినిమా మొత్తానికి హీరోయిన్ మాధవి లత నటన ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని ఆయన తెలియజేశారు.ఈ సినిమాలో కచ్చితంగా సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్రబృందం భావిస్తోంది.

ఇంద్రజ చేయాలనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా.. కానీ అదృష్టం లేదు..?
Advertisement

తాజా వార్తలు