ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

రెగ్యులర్ బెంచ్ లోనే ఈ పిటిషన్లను విచారించనున్నారు.పిటిషన్లపై ఇవాళ విచారణకు రాగా న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అన్నారు.

తరువాత పిటిషన్ల వివరాలను సీజే ముందుంచాలని రిజిస్ట్రార్ ను ఆదేశించారు.అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement
మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు