ప్రభాస్ ఆదిపురుష్ కంటే ముందే పౌరాణిక పాత్రలో ఏ సినిమాలో నటించడో తెలుసా?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో పౌరాణిక చిత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది.

అయితే తరువాత ఎన్నో కమర్షియల్ చిత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన దర్శక నిర్మాతలు తర్వాత ప్రేక్షకులకు అనుగుణంగా పౌరాణిక చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నో పౌరాణిక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నాయి.ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఈ సినిమా తరువాత ప్రభాస్ తిరిగి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో"ఆదిపురుష్"అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రభాస్ ఈ సినిమా కంటే ముందుగానే మరొక పౌరాణిక చిత్రంలో నటించిన విషయం చాలా మందికి తెలియదు.

ప్రభాస్ కుటుంబ విషయానికి వస్తే తన తండ్రి నిర్మాత కావడం,తన పెదనాన్న హీరోగా కావడంతో నిత్యం ఇంట్లో సినీ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలోనే కృష్ణంరాజు కొడుకులు లేకపోవడంతో అతని వారసుడిగా ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి ఈశ్వర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

ఇదిలా ఉండగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్లో ఎన్టీఆర్ హీరోగా యమదొంగ చిత్రం తెరకెక్కింది.

ఈ సినిమాలో ఏదైనా ప్రత్యేకత ఉండాలని భావించిన రాజమౌళి ఇందులో విశ్వామిత్రుడు పాత్ర చేయడం కోసం సంప్రదించారు.ఇది విన్న ప్రభాస్ తన విశ్వామిత్రుడు పాత్రలో నటించడం ఏంటి అనుకున్నారు.అయితే ప్రభాస్ ను రాజమౌళి కన్విన్స్ చేయడంతో అందుకు ప్రభాస్ ఒప్పుకున్నారు.

అలా యమదొంగ సినిమా టైటిల్ పడే సమయంలో ప్రభాస్ విశ్వామిత్రుడి పాత్రలో కనిపిస్తాడు.ఈ విధంగా ప్రభాస్ నటిస్తున్న టువంటి ఆదిపురుష్ చిత్రాన్ని కంటే ముందుగా యమదొంగ సినిమాలో పౌరాణిక పాత్రలో కనిపించారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు