మేడ్చల్ జిల్లా ఘట్‎కేసర్‎లో పోకిరీల వీరంగం..!

మేడ్చల్ జిల్లా ఘట్‎కేసర్‎లో పోకిరీలు వీరంగం సృష్టించారు.విజ్ఞాన భారతి కాలేజ్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

అంతేకాకుండా విద్యార్థినుల వాట్సాప్ డీపీలు సేకరించిన ఆకతాయిలు మార్ఫింగ్ చేసి పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.దీంతో బాధితులను పోలీసులను ఆశ్రయించారు.

ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అనుమానితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.మరోవైపు బాధితులకు మద్ధతుగా కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్ యూఐ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి.

దీంతో నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు