పేదలకు అన్నదానంతో పాటు 30 మంది వృద్ధులకు వస్త్రదానం

రాజన్న సిరిసిల్ల జిల్లా : దాతల సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో 1164 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదానంతో పాటు నందగిరి భాను శర్మ అందించిన 30 దోవతులు, షేల్లాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు.

నేటి అన్నదాతలుగా వేములవాడ పట్టణానికి చెందిన గుప్తాదాత, చింతతడెం లాస్య అశోక్ దంపతులు, దేహనహేల్లి,, బెంగుళూరు వాస్తవ్యులు స్ఫూర్తి,శాశ్వత అన్నదాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కుమారులు కోడళ్లు రామడుగు ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, రామడుగు శిరీష సాయిచంద్ర దంపతులు, రామడుగు శర్వాణి రవిచంద్ర దంపతులు ఉన్నారని, అన్నదానానికి శాశ్వత సభ్యత్వం పొందే వారు ట్రస్టు సభ్యులను సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు కోరారు.

నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నాగుల చంద్రశేఖర్, పాత సంతోష్, తోట రాజు, చల్లా సత్తయ్య, నంది సాయికుమార్, పసూల శ్రీనివాస్, సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు ప్రతి రోజు అప్డేట్ చేయాలి - అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

Latest Rajanna Sircilla News