తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలి:అమిత్ షా

యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ పార్టీకి( Congress party ) ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) అన్నారు.

బీజేపీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి గెలుపును కాంక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ లో గెలిచిన అభ్యర్థులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోస్యం చెప్పారు.30 తారీఖున జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి చలమల్లను( BJP Chalamala Krishna reddy ) గెలిపిస్తే ప్రతి ఒక్కరికి అయోధ్య రామమందిర దర్శనం ఉచితంగా చేపిస్తామని హామీ ఇచ్చారు.చలమల్ల కృష్ణారెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఘనంగా మాజీ ప్రధాని పివినరసింహారావు జయంతి వేడుకలు

Latest Video Uploads News