పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ గారిని కలిసిన విశ్రాంత పోలీసు అధికారుల సంఘం కార్యనిర్వాహక కమిటీ బృందం

విశ్రాంత పోలీసు అధికారుల సంఘం కార్యనిర్వాహక కమిటీ బృందం ఈరోజు పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈరోజు విశ్రాంత పోలీసు అధికారుల సంఘం కార్యనిర్వాహక కమిటీ సమావేశమై ప్రధాన కార్యదర్శిగా రుద్ర వెంకటనారాయణ (రిటైర్డ్ ఎస్ఐ) ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే పాషా (రిటైర్డ్ ఎస్సై) సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గారిని పోలీస్ కమిషనర్ కార్యాలయం కలిసి విశ్రాంతి పోలీస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ గారిని కలసి విన్నతిజ పత్రం అందజేశారు.పోలీస్ సిబ్బందితో పాటు విశ్రాంత పోలీసు అధికారులు, సిబ్బందికి కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే మెడికల్ హెల్త్ క్యాంపులలో వైద్య పరిక్షలు నిర్వహించాలని, ఇతర కుటుంబ, వ్యక్తిగత ఆంశాలను పోలీస్ కమిషనర్ దృష్టి తీసుకొనిరావడంతో పోలీస్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, వెంకటనారాయణ మరియు సంఘ నాయకులు దస్తగిరి, రంగారావు, బుగులయ్య వెంకటేశ్వర్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?
Advertisement

Latest Khammam News