‘శ్రీమంతుడు’పై అనుమానాలు?

మహేష్‌బాబు, శృతిహాసన్‌ జంటగా ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ చిత్రం ‘శ్రీమంతుడు’.

ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాలున్న ఈ సినిమాను విడుదలకు ముందే భారీ స్థాయి మొత్తాలకు అన్ని ఏరియాల్లో అమ్మేశారు అంటూ వార్తలు వచ్చాయి.విడుదలకు ముందే నిర్మాతలకు టేబుల్‌ ప్రాఫిట్‌ వచ్చిందన్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను నిర్మాతలు ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది.భారీ అంచనాలున్న ఈ సినిమాను సొంతంగా విడుదల చేస్తే భారీ లాభాలు వస్తాయి.

కాని సినిమాపై నమ్మకం లేక పోవడం వల్లో ఏమో కాని నిర్మాతలు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను ఈరోస్‌ చేతిలో పెట్టింది.గతంలో మహేష్‌ నటించిన ‘1’ మరియు ‘ఆగడు’ చిత్రాలను ఈ సంస్థ పంపిణీ చేసి చేతలు కాల్చుకుంది.

Advertisement

మరి ఈసారి కూడా చేతులు కాల్చుకుంటుందా లేక సక్సెస్‌ అవుతుందా చూడాలి.ప్రస్తుతం సూపర్‌ ఫ్యాన్స్‌ కాస్త ఆందోళనలో ఉన్నారు.

ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని సినీ వర్గాల వారు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు