గ్రామంలో వెలుగని విద్యుత్ దీపాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని స్థానిక గ్రామపంచాయతీ సమీపంలోని ఏడవ వార్డు విద్యుత్ దీపాలు, గ్రామపంచాయతీ సమీపంలోని ఐమాక్స్ లైట్లు గత 15 రోజుల నుండి వెలగడం లేదు.

దీనిపై గ్రామస్తులు గ్రామపంచాయతీ సెక్రెటరీ సమాచారం ఇవ్వగా వాటిగురించి నాకు చెప్పకూడదని పట్టించుకోవడంలేదని ‌ గ్రామస్తులు తెలిపారు.

గత వారం రోజుల నుండి వర్షాలు పడుతున్నాయని,‌ గ్రామంలో అసలే గ్రామపంచాయతీ ఏరియా అందులో ఏడవ వార్డు ఉండగా లైట్లు వస్తలేవు అని సమాచారం ఎవరు పట్టించుకోవడం లేదు.వర్షం పడితే పురుగు, విషపు పాములు లాంటివి బయటకు వస్తాయి కుడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఇప్పటికైనా గ్రామ హెల్పర్ లేదా అధికారులు చర్యలు తీసుకొని వీధిలైట్లు వచ్చేలాగా చూడాలని గ్రామ ప్రజలకు కాలనీవాసులు కోరుతున్నారు.

డాక్టరేట్ పట్టా ( అవార్డు ) పొందిన రాచర్ల గొల్లపల్లి యువకుడు
Advertisement

Latest Rajanna Sircilla News