ధూప దీప నైవేద్య అర్చక సంఘ కమిటీ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపెళ్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలో రుద్రంగి, చందుర్తి మండల ధూప దీప నైవేద్య అర్చక సంఘం సభ్యులు సోమవారం సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు.

మండల ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులుగా కందాలై వెంకటరమణాచార్యులు, ఉపాధ్యక్షులుగా కోధుమగుళ్ళ శ్రీకాంత్ ఆచార్యులు, కోశాధికారిగా గోపికృష్ణ చారి,కార్యదర్శిగా తీరుకోవెల రాములు, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రుద్రంగి, చందుర్తి మండలాల ధూప దీప నైవేద్య అర్చక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News