భీమ్లా నాయక్ మూవీ పాటకు దుర్గవ్వ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ సినిమా గురించే చర్చ జరుగుతోంది.

రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా తెలుగులో కూడా ఈ సినిమా అదే ఫలితాన్ని అందుకోవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమాలో అడవితల్లి సాంగ్ ను దుర్గవ్వ పాడిన విషయం తెలిసిందే.

ఈ పాట పాడటం వల్ల ప్రస్తుతం దుర్గవ్వ పేరు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో మారుమ్రోగుతోంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో దుర్గవ్వ పాల్గొని తాను ఉంగురం, సిరిసిల్ల పాటలను పాడానని ఆ పాటల వల్ల తనకు ఈ పాట పాడే అవకాశం దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు.

భీమ్లా నాయక్ సినిమా పాటను తాను కేవలం ఐదారు నిమిషాలలో పాడేశానని దుర్గవ్వ వెల్లడించారు.అడవితల్లి పాట పాడినందుకు తనకు 10,000 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని ఆమె అన్నారు.

Advertisement

ఆ తర్వాత తన కూతురికి మిగిలిన డబ్బులను ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.దుర్గవ్వకు మరికొన్ని సినిమాల్లో ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.

థమన్ లాంటి ప్రముఖ సంగీత దర్శకులు దుర్గవ్వ లాంటి జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ ఉండటం గమనార్హం.పవన్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు భీమ్లా నాయక్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.

భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కు తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉండగా ఏపీలో మాత్రం ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి.ఫుల్ రన్ లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement
" autoplay>

తాజా వార్తలు