స్నానం చేస్తూ బాత్‌రూమ్‌లోనే మరణించిన మహిళా ఎన్నారై.. కారణం కనుగొన్న దుబాయ్ పోలీసులు!

కేరళలోని త్రిసూర్‌కు చెందిన 35 ఏళ్ల ఇంజనీర్ నీతు గణేష్( Neethu Ganesh ) దుబాయ్ లో నివసించేది.

ఈమె జూన్ 14న దుబాయ్ లోని( Dubai ) తన విల్లాలోని బాత్‌రూమ్‌లో శవమై కనిపించింది.

స్నానం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై( Electrocuted ) చనిపోయిందని పోలీసులు చాలా దర్యాప్తు తర్వాత తేల్చారు.ఆమె మృతిలో ఏ కుట్ర లేదని, ఎవరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు.

ఘటన జరిగిన సమయంలో నీతు భర్త విశాఖ్ గోపి, వారి 6 ఏళ్ల చిన్నారి నివీష్ కృష్ణ, పనిమనిషి ఇంట్లోనే ఉన్నారు.

ఇప్పుడు నీతు గణేష్ చనిపోయిన భవనంతో పాటు పరిసర ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు ఉన్నాయో లేదో చెక్ చేయడానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు.మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా వారు ఈ చర్యలు చేపడుతున్నారు.ఆ ప్రాంతంలో మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆ రోజు కరెంటు కోతలు ఉన్నాయని కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

ఇంటి నుంచి పని చేస్తున్న నీతు ఉదయం 7:15 గంటలకు స్నానం చేసేందుకు వెళ్లింది.కరెంటు లేకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాంప్ వాడింది.అదే సమయంలో ఇంటి పనిమనిషి కూడా వంటగదిలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైంది.

మరోవైపు బాత్‌రూమ్‌లోంచి కేకలు రావడంతో కుటుంబసభ్యులు ఉలిక్కిపడ్డారు.విశాఖ్ పరుగు పరుగున వెళ్లి బాత్‌రూమ్‌ తలుపులు పగలగొట్టి చూడగా నీతు అపస్మారక స్థితిలో కనిపించింది.

వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు, కానీ దురదృష్టవశాత్తు, ఆమె అప్పటికే చనిపోయింది.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు