హరికృష్ణ గారి ఇల్లు, ఎల్.ఐ.సి డబ్బులు ఎన్ని కొట్లో తెలుసా.. ఆ ముగ్గురు పిల్లలకే చెందుతుంది అంట... ఇంతకీ వారెవరు

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.

నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు.

నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

గురువారం ఆయన అంతక్రియలు ముగిసాయి.గతంలో అదే రోడ్డుపై ఆయన కుమారుడు జానకిరామ్ కూడా ఆక్సిడెంట్ లో మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా.హరికృష్ణ గారు LIC కట్టారు.అలాగే అయన ఆస్థి మొత్తం ఎవరికీ చెందాలో ఒక వీలునామా కూడా చేయించారు అంట.హరికృష్ణ గారు LIC కి కట్టిన డబ్బు దాదాపుగా రూ.20 కోట్లు మరి ఆ డబ్బుని తన ఇద్దరి కొడుకులకి కాకుండా స్వర్గస్తులైన తన పెద్ద కుమారుడు జానకి రామ్ బిడ్డలకి ఈ LIC డబ్బు చెందాలి అని ఆ వీలునామాలో రాసారు.

Advertisement

అంతేకాదు ఇప్పుడు హరికృష్ణ గారు నివసిస్తున్న ఇల్లు కూడా జానకి రామ్ బిడ్డలకు చెందాలి అని హరికృష్ణ గారు వీలునామాలో రాసారు అని సమాచారం.ఇక మోహినాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ మాత్రం తన ఇద్దరి కుమారులకు మరియు జానకి రామ్ బిడ్డలకి చెందాలి అని అయన వీలునామాలో రాసారు .ఆయన ముందు చూపుకి హ్యాట్సాఫ్.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు