పొరపాటున కూడా ఈ వస్తువులను పర్సులో పెట్టుకోకండి.. ఏమిటంటే?

మనలో చాలా మంది సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతో నమ్ముతారు.ఈ క్రమంలోనే వాస్తు ప్రకారం వాస్తుకు అనుగుణంగా నడుచుకుంటారు.

ఈ క్రమంలోనే చాలామంది వారి పర్సులో డబ్బులతో పాటు వివిధ రకాల వస్తువులను పెట్టుకోవడం చేస్తుంటారు.వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకోవడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయని మనం చేపట్టే పనులలో ఎలాంటి ఆటంకాలు ఉండవు అని భావిస్తుంటారు.

ఈ క్రమంలోనే కొందరు లక్ష్మీదేవి ఫోటో అలాగే రావి ఆకులను, అద్దం వంటి వస్తువులను పర్సులో పెట్టుకుంటారు.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను పర్సులో పెట్టకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే.మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకార్థంగా వారి ఫోటోను పర్సులో పెట్టుకుంటారు.

Advertisement

ఇలా చనిపోయిన వారి ఫోటోలను పర్సులో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకోసమే చనిపోయిన వారి ఫోటోలను పర్సులో పెట్టుకోకూడదని చెబుతారు.

చాలామందికి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు వాటికి సంబంధించిన బిల్లు పేపర్లను కూడా పరిధిలో పెట్టుకుంటారు.ఇలా పెట్టుకోవడం ఎంతో అశుభమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇక చాలామంది ఏవైనా బండి తాళాలను, కారు తాళాలను పర్సులో పెట్టుకుంటారు.ఇలా తాళాలను కూడా పర్సులో పెట్టుకోకూడదు.తాళాలను పర్సులో పెట్టుకోవటం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.

ఇది ఆర్థిక ఒత్తిడికి కారణం అవుతుంది.కనుక పర్సులో ఈ విధమైనటువంటి వస్తువులను పెట్టుకోకూడదని ఇలా పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.

వారంలో 3 సార్లు ఈ మిల్క్ షేక్‌ను తీసుకుంటే మీ ఆరోగ్యం ప‌దిలం!

Advertisement

తాజా వార్తలు