మహబూబాబాద్ టీఆర్ఎస్‎లో భగ్గుమన్న విభేదాలు

మహబూబాబాద్ లో మంత్రుల సాక్షిగా టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వివాదం చేలరేగింది.

జిల్లాలో నూతన పార్టీ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ లు సందర్శించారు.ఈ నేపథ్యంలో కాంట్రాక్టర తో సంబంధం లేకుండా తానే పనులు చేశానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెబుతుండగా.

నిర్మాణ ఖర్చులు పార్టీ భరిస్తోందని మాలోత్ కవిత అడ్డుపడ్డారు.మంత్రుల ఆధ్వర్యంలోనే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అనంతరం మంత్రులు ఇద్దరు నేతలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement
చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు