పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.. దాసోజు శ్రవణ్

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ నగర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థలాన్ని స్థానికులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నాణ్యత లేకుండా కడుతున్నారని ఆరోపించారు.టిఆర్ఎస్ నేతలు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇళ్లను ఇలాగే నిర్మించుకుంటారా అని ప్రశ్నించారు.

తమ పార్టీ ఇల్లు నిర్మించే వరకు నిద్రించదని హెచ్చరించారు.అంకుశమై టిఆర్ఎస్ నేతల వెన్నులో పొడిచి మరీ పేదలకు ఇళ్లు నిర్మించేలా కృషి చేస్తామని అన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు