దసరా సినిమాలకు భారీ బిజినెస్.. ఎవరిది పైచేయి అంటే?

దసరా సీజన్ లో కూడా మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు బరిలోకి దిగుతారు.బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో దండయాత్ర చేస్తుంటారు.

అయితే ఈ ఏడాది దసరా బరిలో ముగ్గురు హీరోలు బరిలోకి దిగబోతున్నారు.ఇప్పటి వరకు వచ్చిన రిలీజ్ డేట్ ల ప్రకారం ముగ్గురు స్టార్ హీరోలు తమ రిలీజ్ డేట్ లను దసరాకు ఖరారు చేసుకున్నారు.

మరి ఆ హీరోల్లో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కాగా ఒకరు కోలీవుడ్ స్టార్.మన టాలీవుడ్ నుండి నందమూరి నటసింహం బాలయ్య,( Nandamuri Balakrishna ) మాస్ రాజా రవితేజ బరిలోకి దిగబోతుంటే కోలీవుడ్ నుండి విజయ్ దళపతి( Thalapathy vijay )బరిలోకి దిగనున్నారు.

అయితే ఈసారి మునుపెన్నడూ లేని విధంగా దసరా సీజన్ లో రాబోతున్న సినిమాలకు భారీ బిజినెస్ జరిగింది.

Advertisement

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి( Bhagwant kesari ) తెరకెక్కుతుంది.దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే భారీ బిజినెస్ చేసుకుంది.భగవంత్ కేసరి ఓవరాల్ గా అన్ని ఏరియాలు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.

ఇక మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.( Tiger Nageswara Rao ) ఈ సినిమా కూడా ట్రైలర్ ఇంకా రాకుండా ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల భారీ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.ఇక ఈ ఇద్దరితో పాటు విజయ్ లియోతో అక్టోబర్ 19నే బరిలోకి దిగబోతున్నాడు.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే 22 కోట్ల బిజినెస్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.మొత్తం మీద ఈసారి దసరా సినిమాలకు గట్టి బిజినెస్ నే జరిగింది.

మూడు సినిమాలకు ఇంకా టీజర్స్ మాత్రమే వచ్చాయి.ట్రైలర్స్ కూడా రాకుండానే డిస్టిబ్యూటర్స్ సినిమాలపై నమ్మకంతో భారీగా పెట్టారు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

చూడాలి వీరికి నష్టాలను మిగులుస్తాయో.లాభాలను తెచ్చిపెడతాయో.

Advertisement

తాజా వార్తలు