హైదరాబాద్ లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్ లోని సీపీఎం కార్యాలయంలో మరికాసేపటిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే కామ్రేడ్ లకు బీఆర్ఎస్ పార్టీ దూరం అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీపీఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఎం భావిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సీపీఎం కార్యవర్గ సమావేశం కొనసాగనుంది.కాగా ఈ కీలక సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు తమ్మినేని వీరభద్రం, రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు తదితరులు హాజరుకానున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్10, మంగళవారం 2024
Advertisement

తాజా వార్తలు