డీఎంకే ఎంపీ కి క‌రోనా పాజిటివ్.. ఎన్నికల ప్రచారమే కారణమట.. ?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎవరిని వదిలి పెట్టడం లేదు.ఈ విషయం తెలిసి కూడా దాదాపుగా ఎవరు తగినంతగా శ్రద్ద వహించడం లేదని అర్ధం అవుతుంది.

 Tamilnadu Dmk Mo Kaniimozhi Tested Positive For Covid, Tamilanadu, Dmk Mp Kanimo-TeluguStop.com

అందువల్ల పెరుగుతున్న కరోనా విషయంలో దీని కట్టడికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టక తప్పడం లేదు.
ఇకపోతే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలు, కార్యకర్తలు ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్న విషయం తెలిసిందే.

తాజాగా త‌మిళ‌నాడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం నిర్వ‌హించిన డీఎంకే ఎంపీ క‌నిమొళి కి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.ఈ మేర‌కు ఎంపీ అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇక ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని క‌నిమొళి సూచించారు.ఇకపోతే త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన్నందు వల్లే క‌నిమొళికి క‌రోనా వ్యాపించి ఉండొచ్చ‌ని పార్టీ నాయ‌క‌త్వం భావిస్తోందట.

ఏది ఏమైన కరోనా ఉన్నదన్న భయం లేకుండా ఇలా బహిరంగ సమవేశాలు నిర్వహిస్తే గెలవడం మాట పక్కన పెడితే కరోనా పట్టుకోవడం మాత్రం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube