వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ.. : ఈటల రాజేందర్

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగానూ, హుజురాబాద్ లోనూ ఈ రెండు చోట్లా పోటీ చేస్తానని తెలిపారు.

ఈ క్రమంలో హుజూరాబాద్ లో కార్యకర్తలే కథానాయకులు అవ్వాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి మరియు గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ ను కానీ బీఆర్ఎస్ ను కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఈటల చెప్పారు.ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు