ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది.

ఈ మేరకు ఈ నెల 6వ తేదీన తుక్కుగూడ వేదికగా ‘జనజాతర’ సభను( Janajatara Sabha ) నిర్వహించనుంది.

కాగా ఈ జనజాతర సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,( Rahul Gandhi ) ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో( Mallikarjuna Kharge ) పాటు ముఖ్యనేతలు హాజరుకానున్నారు.దీంతో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఈ క్రమంలోనే భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ నేతలకు తెలంగాణ పీసీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.కనీసం పది లక్షల మంది సభకు వచ్చే విధంగా జనసమీకరణ చేయాలని యోచనలో కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్లమెంట్ లకు మంత్రులు, ముఖ్యనేతలకు టీ -పీసీసీ ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించింది.రేపు పార్లమెంట్ ఇంఛార్జ్ నేతలు అంతా తమ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించాలని టీ-పీసీసీ ఆదేశించింది.

Advertisement
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

తాజా వార్తలు