యాంకర్ రష్మికి గుండు కొట్టిస్తా... జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్...షాక్ లో రష్మీ?

బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమం కూడా ఒకటి.

ఈ కార్యక్రమం గత దశాబ్ద కాలంగా బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

అయితే గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి లేదు అని చెప్పాలి ఇలా ఈ కార్యక్రమానికి రేటింగ్ క్రమంగా తగ్గుతూ రావడంతో ఈ షో క్లోజ్ చేస్తారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి కానీ మల్లెమాల వారి నుంచి ఏ విధమైనటువంటి ప్రకటన రాలేదు.ఇక ఈ కార్యక్రమానికి రేటింగ్ కాస్త తక్కువ కావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్ తమ స్కిట్లలో భాగంగా డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.

అయినప్పటికీ ముందు ఉన్నంత క్వాలిటీ ప్రస్తుతం స్కిట్లలో లేదని స్పష్టంగా అర్థమవుతుంది.ఇక కమెడియన్స్ చేసే ఈ స్కిట్ లలో భాగంగా యాంకర్ రష్మీ (Rashmi) కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.

కమెడియన్స్ కూడా ఆమెపై తమదైన శైలిలో సెటైర్స్ వేస్తూ ఉంటారు.ఇటీవల ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో భాగంగా ఒక కమెడియన్ ఏకంగా రష్మికి గుండు కొట్టిస్తాను అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో అందరూ కమెడియన్స్ కూడా తమ అద్భుతమైనటువంటి పర్ఫామెన్స్ చేసే ప్రేక్షకులను నవ్వించారు.ఆఫ్ స్క్రీన్ కపుల్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి రాకింగ్ రాకేష్ (Rakesh )సుజాత(Sujatha ) జంట కూడా ఈ కార్యక్రమంలో తమ స్కిట్ ద్వారా అందరిని నవ్వించారు.ఇందులో భాగంగా సుజాత ఎంతో భక్తి కలిగినటువంటి అమ్మాయిగా కనపడుతుంది అయితే ఆమె భక్తి కారణంగా తమ కాలనీలో ఉన్న వారందరు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

మొన్నటికి మొన్న రష్మికి కూడా గుండు కొట్టిస్తాను అంటూ మొక్కుకుంది అని రాకేష్ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా రష్మీ షాక్ అయింది ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ప్రోమో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు