చిన్మయి తల్లి కాళ్ళు పట్టుకున్న షారుఖ్ ఖాన్.. కారణం ఏంటంటే?

సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గతంలో జరిగిన మీటూ ఉద్యమం ద్వారా ఈమె ఎంతో పాపులర్ అయింది.

ఈ క్రమంలోనే అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ మహిళల పట్ల జరిగే అరాచకాలు గురించి ప్రశ్నిస్తుంది.దీంతో కొన్నిసార్లు ఈమె దారుణమైన ట్రోలింగ్ కు గురవుతుంది.

ఈ క్రమంలోనే చిన్మయి సోషల్ మీడియా వేదికగా వరుస ట్విట్లు చేసింది.ఇందులో ఆమె గతంలో షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా గురించి చెప్పుకొచ్చారు.

చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో చిన్మయి పాడిన టిట్లీ పాట ఎంతో పాపులర్ అయింది.ఈ క్రమంలోనే ఈమెను ప్రశంసిస్తూ షారుక్ ఖాన్ ఆమెకు ట్వీట్ చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

అలా ఇప్పటివరకు తనని మెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో అతనేనని, తను ఏ కార్యక్రమానికి వెళ్లిన తన పాట గురించి ప్రశంసించారని ఈ సందర్భంగా చిన్మయి తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో షారుక్ ఖాన్ తన తల్లి గురించి అడిగారని అలా ఒక స్టార్ హీరో తన తల్లి గురించి మాట్లాడటం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలియజేశారు.

ఇకపోతే ఆడియో ఫంక్షన్ పూర్తయిన తర్వాత అందరు వెళ్తున్న సమయంలో షారుక్ ఖాన్ తన దగ్గరకు వచ్చి తన తల్లితో మాట్లాడాలి అనుకుంటున్నానని తెలిపారు.

ఈ క్రమంలోనే నా ఫోన్ లాక్కొని అమ్మకు ఫోన్ చేసి దాదాపు పదిహేను నిమిషాల వరకు మాట్లాడారు.ఇలా ఫోన్లో మాట్లాడిన కొద్దిరోజులకు పని నిమిత్తం చెన్నైకి రావడంతో అక్కడ ఎంతో మంది ఉన్నప్పటికీ షారుక్ ఖాన్ తన తల్లి వద్దకు వచ్చి తన తల్లి కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.అతనికి తన తల్లి కాలు నమస్కరించవలసిన అవసరం ఏమాత్రం లేదు.

అయినా స్టార్ హీరోలు ఇలా కూడా ఉంటారా అంటూ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.ఇలా ఎంతో మంచి మనసున్న ఆ కుటుంబం ప్రస్తుతం ఎంతో ఇబ్బందులలో ఉందని ఈ బాధల నుంచి కుటుంబం బయటకు రావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు