రాజన్న సినిమాలో నటించిన ఈ చిన్నారి ఎంతగా మారిపోయిందో తెలుసా..?

తెలుగులో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు వస్తుంటారు పోతుంటారు.

అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అమ్మాయి మాత్రం తన నటన ద్వారా చిన్నప్పుడే నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకొని.

ఇప్పుడు ఇండస్ట్రీలోనే సెట్టిల్ అయిపోయింది.ఆమె ఎవరో కాదు మల్లన్న సినిమాలో నాగార్జున కూతురు మల్లమ్మగా మనందరికి బాగా దగ్గరైన బేబీ అన్నీ.

రాజన్న సినిమాలో మల్లమ్మగా ఒక మారుమూల పల్లెటూరి నుండి ఢిల్లీ పోయి అక్కడ ప్రధాని మంత్రి నెహ్రు గారిని కలుసుకొని వాళ్ళ ఊరిని దుష్టుల నుండి కాపాడుకున్న 8 ఏళ్ల బాలిక పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది బేబీ అన్నీ.అందుకే ఆ సినిమాకి గాను ఆమెకి నంది అవార్డు కూడా బహుకరించారు.

అలా తెలుగులో ఒక్క మల్లన్న మాత్రమే కాదు రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన “రంగస్థలం” చిత్రం కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే.ఆ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన చిన్నారి అన్నీ.

Advertisement

తనదైన నటనతో మంచి మార్కులు వేసుకుంది.అలా బేబీ అన్నీ.

ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మనల్ని అలరిస్తోంది.అయితే బేబీ అన్నీ ఎక్కడ పుట్టింది అసలు సినిమాల్లోకి ఎలా వచ్చింది.

ఇప్పుడేం చేస్తోంది లాంటి తన వ్యక్తగత విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే.తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగింది బేబీ అన్నీ.

హైదరాబాద్ కావడం, అందులో వాళ్ళ ఫ్యామిలీకి సినిమావాళ్లు ఎక్కువమంది తెలుసుండడంతో "బేబీ" సినిమాల్లోకి రావడం చాల ఈజీ అయిపోయింది.అలా తెలిసిన వారి ద్వారా 2005వ సంవత్సరంలో టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు, చార్మి కౌర్ నటించిన “అనుకోకుండా ఒక రోజు” చిత్రంలో బాలనటిగా నటించే అవకాశం లభించింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఆ సినిమా విడుదలయ్యాక అందరూ అరే ఈ పిల్ల ఎవరో బలే యాక్ట్ చేస్తుందే అనుకున్నారు.అందుకే వరసగా బేబీ కి అవకాశాలు రావడం మొదలైంది.మరిన్ని తెలుగు చిత్రాలలో నటించే అవకాశాలు దక్కించుకుంది.

Advertisement

అయితే ఎన్ని అవకాశాలు వచ్చినా బేబీ చదువును మాత్రం పక్కన పెట్టలేదు.అటు చదువుని, ఇటు తనకు ఇష్టమైన సినిమాలని బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తోంది.

ఇక ఇప్పటివరకు "బేబీ అన్నీ" తెలుగులో కింగ్ నాగార్జున, మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, నందమూరి బాలకృష్ణ, లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఇక ఇటీవలే జీ5 లో విడుదలైన "లూసర్" వెబ్ సిరీస్ లో ఒక బ్యాట్మిటన్ క్రీడాకారిణిగా అదరగొట్టేసింది.

ఇక బేబీ అన్నీ 2005 లో తన కెరియర్ స్టార్ట్ చేస్తే.2018 లో రంగస్థలం రిలీజ్ అయింది సో, ఇప్పటికే ఈమె ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలవుతుంది.అంతేకాదు ఇప్పటివరకు 16 సినిమాల్లో, ఒక వెబ్ సిరీస్ లో నటించింది.

ఇక ప్రెసెంట్ ఈమె సినిమాల్లోనే హీరోయిన్ గా అలాగే మంచి మంచి పాత్రల కోసం ఎదురు చూస్తోంది.ఇంకా ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గానే ఉంటుంది.

మరి ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో అయితే మంచి మంచి రీల్స్ చేస్తూ, ఫొటోస్ పెడుతూ ఎంటర్టైన్ చేస్తుంది.ఈమెకి ఇప్పటివరకు ఇంస్టాగ్రామ్ లో లక్షవరకు ఫాలోవర్స్ వున్నారు.

సో, అదండీ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ కథ! ఈమెకి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాల్లో అవకాశాలు రావాలని కోరుకుందాం.

తాజా వార్తలు