సంచలనంగా మారిన భవ్య సిమెంట్స్‌ అధినేత వ్యవహారం.. ?

లోకంలో కనీసం బ్రతకడానికి సరిపడా డబ్బులు లేక ఎందరో అభాగ్యులు ప్రాణాలు తీసుకుంటున్నారు.

కానీ ఇదే డబ్బును మోసాలు చేసైనా సంపాదిస్తూ, విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవారు పెడుతూనే ఉన్నారు.

ఇక మోసం చేసే వారినే లోకం నమ్ముడం అనాదిగా వస్తున్న అంశమే.ఇలాగే ఒక బడా వ్యాపారీ 100కోట్ల వరకు అప్పులు చేసిన చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

అతనే భవ్య సిమెంట్స్‌ అధినేత ఆనంద్‌ ప్రసాద్‌.ఇతను, సినీ నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌, ఆదిత్య వెన్నిగల, శివకుమార్‌లు 2017లో జూపల్లి సత్యనారాయణరావు అనే అతని వద్దకు వచ్చి మాకు బాచుపల్లి, దుండిగల్‌, బౌరంపేటల్లో స్థలాలు ఉన్నాయి.

ఈ స్థలాలను మార్కెట్‌ ధరకు మీకు రిజిస్టర్‌ చేస్తామని బురిడి కొట్టించి డబ్బులు తీసుకున్నారట.అదీగాక సిమెంట్‌ వ్యాపారంలో వచ్చిన లాభాల్లో 4 శాతం ఇస్తామని కూడా నమ్మించారట.

Advertisement

మొత్తానికి సత్యనారాయణ భవ్య సిమెంట్స్‌ సంస్థ పేరు మీద ఉన్న ఖాతాకు కోటి రూపాయలను చెక్‌ ద్వారా బదిలీ చేసేలా నమ్మించారు.ఇక అప్పటి నుండి డబ్బులడిగితే బెదిరింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది.ఈ విధంగా ఆనంద్‌ ప్రసాద్‌ దాదాపు 100 మంది నుంచి రూ.100 కోట్లు తీసుకున్నాడని తేలిందట.అయితే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ బయటికి రావడంతో భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది.

కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?
Advertisement

తాజా వార్తలు