హైదరాబాద్‎లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు

అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

భూవివాదంలో ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై కేసు దాఖలు అయింది.

ఈ మేరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై గోల్డ్ ఫిష్ అడోబ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.కోకాపేట స్థలంలో అక్రమంగా చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదేవిధంగా 60 మందితో వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు