హీరోయిన్‌పై లాక్‌ డౌన్‌ నిబంధనల ఉల్లంఘింపు కేసు

తమిళంలో హీరోయిన్‌గా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకు సుపరిచితురాలు వనిత విజయ్‌ కుమార్‌.ఈమె తెలుగు ఆడియన్స్‌కు కూడా పరిచయమే.

ఈమె గురించి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ ఇన్నీ కావు.ఈమె ముఖ్యంగా మూడవ పెళ్లి చేసుకున్నప్పటి నుండి రచ్చ రచ్చగా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈమె పెళ్లి చేసుకున్న పీటర్‌ పాల్‌ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వక పోవడంతో మొదలైన వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడ్డట్లయ్యింది.పీటర్‌ పాల్‌ భార్య ఇప్పటికే వనితపై కేసు పెట్టింది.

నా భర్తను పెళ్లి చేసుకుంది అంటూ ఆమె ఆరోపణలు చేస్తోంది.ఈ విషయమై లక్ష్మీ అనే నటి వనితను ప్రశ్నించిన సమయంలో లైవ్‌లో బండబూతులు తిట్టింది.

Advertisement

వనిత తీరుపై విమర్శలు వచ్చాయి.ఇప్పటికే లక్ష్మీ కేసు పెట్టింది.

రెండు కేసులు ఉండగా ఇప్పుడు మూడవ కేసు ఆమెకు తగిలింది.లాక్‌ డౌన్‌ టైంలో ఆమె పార్టీలు అంటూ జనాలను పిలిచి అపార్ట్‌మెంట్‌లో వేడుక చేసింది అంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.

చెన్నైలోని వనిత విజయ్‌ కుమార్‌ ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది.ఆ అపార్ట్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కరోనా సమయంలో వనిత వేడుకలు నిర్వహించుకుంటుందని, తద్వారా అపార్ట్‌మెంట్‌ వాళ్లందరు కూడా ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుంది అంటూ పోలీసులకు తెలియజేశాడు.దాంతో పోలీసులు వనితపై లాక్‌ డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కేసును నమోదు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు