BRS : తెలంగాణలో లోక్‎సభ అభ్యర్థుల ప్రకటనకు బీఆర్ఎస్ సిద్ధం..!

త్వరలో లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.

ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న గులాబీ పార్టీ ఇవాళ ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైంది.

కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించనున్నారు.

అయితే కరీంనగర్ ( Karimnagar )లోక్‎సభ స్థానం నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ కు పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాలతో పాటు మరో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇప్పటికే నియోజకవర్గ నేతలతో సమావేశమవుతున్న కేసీఆర్( KCR ) వారికి దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఫ్యూచర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ముగ్గురి మీదనే ఆధారపడి ఉందా..?
Advertisement

తాజా వార్తలు