మిరియాలు, ప‌సుపు క‌లిపి తీసుకుంటే ఆ స‌మ‌స్య‌లు దూరం?

మిరియాలు.ఘాటైన రుచి క‌లిగి ఉండే వీటి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మ‌రియు ఎన్నో పోష‌కాలు నిండి ఉన్నాయి.అందువల్లే, మిరియాల‌ను రెగ్యుల‌ర్ డైట్‌లో తీసుకుంటే.

ఎన్నో జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతుంటారు.ఇక ప‌సుపు విష‌యానికి.

ప్ర‌తి ఇంట్లోనూ ప్ర‌తి రోజు ఏదో ఒక విధంగా దీనిని వాడుతుంటారు.ప‌సుపులో చిన్న చిన్న గాయాలు దగ్గర నుండి ప్రాణాంత‌క‌మైన కాన్సర్ వ్యాధి వరకు నయం చేయగల ఔషధ గుణాలు ఉన్నాయి.

Advertisement

అయితే ఈ రెండు గొప్ప ప‌దార్థాలు విడివిడిగా కాకుండా క‌లిపి తీసుకుంటే మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని అంటున్నారు.అవును, మిరియాలు మ‌రియు ప‌సుపు క‌లిపి తీసుకుంటే.

బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చ‌ట‌.అవేంటో చూసేయండి మ‌రి.

మ‌ధుమేహం నేటి కాలంలో కోట్ల మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.అయితే మ‌ధుమేహం ఉన్న వారు ప‌సుపు, మిరియాల పొడి క‌లిపి తీసుకుంటే.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలో అదుపులో ఉంటాయ‌ని నిపుణులు అంటున్నారు.

అలాగే వ‌య‌సు సంబంధం లేకుండా చాలా మంది అధిక బ‌రువుతో ఇబ్బంది ప‌డుతున్నారు.ఈ క్ర‌మంలోనే కొంద‌రు బ‌రువు త‌గ్గేందుకు చెమ‌ట‌లు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అయితే అలాంటి వారు ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఒక గ్లాస్ వేడి నీటితో ప‌సుపు మ‌రియు మిరియాల పొడి క‌లిపి తీసుకోవాలి.ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అద‌నంగా పెరుకుపోయిన కొవ్వు క‌రిగి.

Advertisement

బ‌రువు త‌గ్గుతారు.

అదేవిధంగా, ప్ర‌తి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో ప‌సుపు మ‌రియు మిరియాల పొడి క‌లిపి సేవిస్తే.గుండె పోటు, ఇత‌ర గుండె జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.అదే స‌మ‌యంలో ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది.

ఆందోళన, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డేవారు కూడా పాల‌ల్లో ప‌సుపు మ‌రియు మిరియాల పొడి క‌లిపి తీసుకుంటే మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఇక మిరియాలు మ‌రియు ప‌సుపు క‌లిపి తీసుకుంటే.

శ‌రీరం రోగ నిరోధ‌క శ‌క్తి కూడా బ‌ల‌ప‌డుతుంది.

తాజా వార్తలు