కేసీఆర్ పాల‌న అంతం చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్న బీజేపీ ఎమ్మెల్యే..!

ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని యాద‌గిరిగుట్టలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్ చేప‌ట్టిన మూడో విడత ప్ర‌జా సంగ్రామ యాత్ర ప్రారంభ‌మైంది.

ఈ పాద‌యాత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్ర మంత్రుల్లో స‌గం మంది తెలంగాణ వ‌ద్ద‌న్న వాళ్లేన‌ని ఈట‌ల తెలిపారు.కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతూ.

ఇక్క‌డ‌ త‌న కొడుకుని సీఎం చేయ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు.కేసీఆర్ పాల‌న‌లో సామాజిక న్యాయం లేద‌ని ఆరోపించారు.

అధికారంలోకి వ‌చ్చి 8 సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఏ ఒక్క రోజు స‌చివాల‌యానికి రాలేద‌ని ఈట‌ల రాజేంద‌ర్ ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఉంటే ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో లేదా ఫామ్ హౌస్ లో ఉంటార‌ని మండిప‌డ్డారు.

Advertisement

సీఎం ఏనాడు ప్రజా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోలేద‌న్న ఈట‌ల‌. ఇటీవ‌ల వ‌ల్ల వ‌చ్చిన భారీ వ‌ర్షాల‌తో ఎంతో మంది నిరాశ్ర‌యులై ఇబ్బందుల‌కు గురైన ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు.

ఈ క్ర‌మంలో రానున్న ఎన్నిక‌ల్లో కేసీఆర్ కుటుంబ పాల‌న‌ను అంత‌మొందించ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంద‌ని తెలిపారు.అదేవిధంగా ఈ సారి తెలంగాణ‌లో తామే అధికారంలోకి వ‌స్తామ‌ని ఈట‌ల ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు