బిగ్ బాస్ 5 : ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 5 ఏడవ వారం ఎనిమిది మంది కంటెస్టంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.వేటగాడు.

అరిటిపండు.కోతిబొమ్మలతో ఈ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా సాగాయి.

అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో సన్నీ మాత్రమే హైలెట్ గా నిలిచాడు.ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో శ్రీరాం చంద్ర, ప్రియ, అనీ, సిరి, రవి, కాజల్, జశ్వంత్, లోబో ఉన్నారు.

అయితే సోమవారం మిడ్ నైట్ నుండి మొదలైన ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో కొందరు లీస్ట్ ప్లేస్ లో కొందరు ఉన్నారు.ఇక ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న హౌజ్ మెట్స్ విషయానికి వస్తే ముందుగా అనీ మాస్టర్ అని చెప్పొచ్చు.

Advertisement

హౌజ్ లో తన ఆట తను ఆడుతున్నా స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ను అనీ టార్గెట్ చేయడం బయట ఉన్న వారి ఫ్యాన్స్ కు ఆమె నెగటివ్ అయ్యింది.అందుకే ఈవారం అనీ కూడా డేంజర్ జోన్ లో ఉందని చెప్పొచ్చు.

ఇక నెక్స్ట్ ప్లేస్ లో లోబో కూడా ఉన్నాడు.లాస్ట్ వీక్ సీక్రెట్ రూం లో ఉన్న లోబో ఈ వారం మొత్తం ఎలాంటి టాస్క్ లు ఆడే ఛాన్స్ కనిపించట్లేదు.

అందుకే లోబో బయటకు వచ్చేస్తాడని టాక్.ఇక ఈవారం డేంజర్ జోన్ లో ఉన్న మరో కంటెస్టంట్ ప్రియ.

హౌజ్ లో ఆమె ప్రవర్తిస్తున్న తీరుకి కొందరు అసంతృప్తిగా ఉన్నారు.ప్రియ కూడా ఈ వారం డేంజర్ జోన్ లో ఉండొచ్చని చెబుతున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

మొత్తానికి 8 మంది నామినేషన్స్ లో ఉండగా ముగ్గురు మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు