ఎన్టీఆర్‌ షో : ఫస్ట్‌ చరణ్‌, లాస్ట్‌ మహేష్‌

జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో అతి త్వరలో ముగించబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.ఎన్టీఆర్ ఈ షో కు సంబంధించిన చివరి షెడ్యూల్‌ ను కూడా పూర్తి చేశాడు.

 Ntr Emk Show Last Episode With Mahesh Babu,latest Tollywood News-TeluguStop.com

కనుక వచ్చే నెలలో ఏ క్షణంలో అయినా ముగించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో సీజన్ 1 చివరి ఎపిసోడ్‌ ను మహేష్‌ బాబు ఎపిసోడ్‌ తో ముగించాలనే నిర్ణయానికి వచ్చారట.

దసరా కు ముందే మహేష్‌ బాబుతో ఎన్టీఆర్ షో ఎపిసోడ్‌ ను షూట్‌ చేశారు.దసరాకు టెలికాస్ట్‌ చేయాలనుకున్నారు.

కాని సమంత ఎపిసోడ్ ను దసరా కు టెలికాస్ట్‌ చేశారు.ఇక దీపావళికి అయినా మహేష్‌ బాబు ఎపిసోడ్‌ వస్తుంది అనుకుంటే అనూహ్యంగా జెమిని టీవీలో ఈ సీజన్‌ చివరి ఎపిసోడ్ లో మహేష్ బాబు వచ్చేలా ప్లాన్‌ చేశారు.

Telugu Emk, Gemini Tv, Mahesh Babu-Movie

ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదటి ఎపిసోడ్‌ కు రామ్‌ చరణ్ గెస్ట్ గా హాజరు అయ్యాడు.ఆ కర్టన్ రైజ్‌ ఎపిసోడ్‌ కు మంచి రేటింగ్ వచ్చింది.కనుక సీజన్ చివరి ఎపిసోడ్ కు కూడా మంచి రేటింగ్‌ ను తెప్పించి ఎన్టీఆర్‌ కు గౌరవంగా బై చెప్పాలనే ఉద్దేశ్యంతో చివరి ఎపిసోడ్ గా మహేష్‌ బాబు షో ను ప్లాన్ చేశారు అంటున్నారు.మొత్తానికి ఎవరు మీలో కోటీశ్వరులు ముగించబోతున్న నేపథ్యంలో మహేష్‌ బాబు గెస్ట్‌ గా రావడం ఆనందాన్ని కలిగిస్తుంది.

అభిమానులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఆ ఎపిసోడ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్‌ మరియు మహేష్‌ బాబు లు మంచి స్నేహితులు.వీరిద్దరు కలిసి ఆడటంను అంతా ఆసక్తిగా చూడాలనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube