జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో అతి త్వరలో ముగించబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.ఎన్టీఆర్ ఈ షో కు సంబంధించిన చివరి షెడ్యూల్ ను కూడా పూర్తి చేశాడు.
కనుక వచ్చే నెలలో ఏ క్షణంలో అయినా ముగించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో సీజన్ 1 చివరి ఎపిసోడ్ ను మహేష్ బాబు ఎపిసోడ్ తో ముగించాలనే నిర్ణయానికి వచ్చారట.
దసరా కు ముందే మహేష్ బాబుతో ఎన్టీఆర్ షో ఎపిసోడ్ ను షూట్ చేశారు.దసరాకు టెలికాస్ట్ చేయాలనుకున్నారు.
కాని సమంత ఎపిసోడ్ ను దసరా కు టెలికాస్ట్ చేశారు.ఇక దీపావళికి అయినా మహేష్ బాబు ఎపిసోడ్ వస్తుంది అనుకుంటే అనూహ్యంగా జెమిని టీవీలో ఈ సీజన్ చివరి ఎపిసోడ్ లో మహేష్ బాబు వచ్చేలా ప్లాన్ చేశారు.
ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదటి ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా హాజరు అయ్యాడు.ఆ కర్టన్ రైజ్ ఎపిసోడ్ కు మంచి రేటింగ్ వచ్చింది.కనుక సీజన్ చివరి ఎపిసోడ్ కు కూడా మంచి రేటింగ్ ను తెప్పించి ఎన్టీఆర్ కు గౌరవంగా బై చెప్పాలనే ఉద్దేశ్యంతో చివరి ఎపిసోడ్ గా మహేష్ బాబు షో ను ప్లాన్ చేశారు అంటున్నారు.మొత్తానికి ఎవరు మీలో కోటీశ్వరులు ముగించబోతున్న నేపథ్యంలో మహేష్ బాబు గెస్ట్ గా రావడం ఆనందాన్ని కలిగిస్తుంది.
అభిమానులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఆ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు లు మంచి స్నేహితులు.వీరిద్దరు కలిసి ఆడటంను అంతా ఆసక్తిగా చూడాలనుకుంటున్నారు.