జోగినాయుడుకు కీలక పదవి కట్టబెట్టిన జగన్ సర్కార్.. ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ బండ్ల ట్వీట్!

గత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జగన్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నటువంటి సినీ సెలబ్రిటీలకు జగన్ సర్కార్ ఒక్కొక్కరికి కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు.

ఇప్పటికే పోసాని ఆలీ సింగర్ మంగ్లీ వంటి వారికి కీలక పదవులు ఇచ్చినటువంటి జగన్ సర్కార్ తాజాగా కమెడియన్ జోగినాయుడుకి కూడా కీలక పదవి అప్పచెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించారు.ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇలా కమెడియన్ జోగినాయుడుకి ఇలాంటి పదవి అప్ప చెప్పడంతో ఈ విషయంపై నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ స్పందిస్తూ జగన్ గారిని నమ్ముకున్నందుకు జోగినాయుడికి కూడా పదవి ఇచ్చారు.ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ ఈయన ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ విధంగా బండ్ల గణేష్ కమెడియన్ జోగి నాయుడుకు ఆల్ ద బెస్ట్ చెబుతూ చేసినటువంటి ఈ ట్వీట్ పై జనసేన నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే పవన్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈయనని ఎందుకు దూరం పెట్టారో ఇప్పుడు అర్థమైంది కదా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి తనని నమ్మి 151సీట్లు గెలిపించారు నమ్మకం నిలబెట్టుకోవాలి కదా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇక కొందరైతే పవన్ కళ్యాణ్ అన్న మీరు కొందరిని దూరం పెడితేనే బాగుంటుంది అంటూ బండ్ల గణేష్ ట్వీట్ పై కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు