పెళ్లాడబోతున్న నిర్మాత దర్శకుడు

ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరితో పుడుతుందో చెప్పలేం .సరిగ్గా ఇదే అనుభవించింది అగ్ర నిర్మాత అశ్వినిదత్ కూతురు ప్రియాంకా దత్.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి, శేఖర్ కమ్ముల దగ్గర సహాయక రచయితగా పనిచేసి నాని " ఎవడే సుబ్రహ్మణ్యం " తో దర్శకునిగా మారిన నాగ్ అశ్విన్ తో ప్రేమలో పడింది ప్రియాంక.ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మాత ప్రియంకానే కావడం విశేషం.

ఈ సినిమా సెట్లోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది.గత రెండు రోజులుగా వీరి ప్రేమాయణం మీద వస్తున్న వార్తలను నిజం చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్లు కన్ఫర్మ్ చేసాడు.

పెళ్లి డేట్ ఫిక్స్ చేయడమే మిగిలింది.అశ్విని దత్ రెండో కూతురైన ప్రియాంక దత్ పవన్ కళ్యాన్ బాలు సినిమాతో సహా నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Advertisement

తరువాత సొంతంగా త్రీ ఏంజిల్స్ స్టూడియో అనే నిర్మాణ సంస్థ స్థాపించి బాణం,సారోచ్చారు, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలను నిర్మించింది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు