పవన్ పై ఇష్టాన్ని ఈసారి అక్కడ చూపించిన అషురెడ్డి..?

బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొన్న తర్వాత అషు రెడ్డి క్రేజ్ మాత్రం బాగా పెరిగింది.

సోషల్ మీడియా లో డబ్ స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంత గా గుర్తింపు పొందిన అషు ఆ తర్వాత వెండితెరపై నితిన్ నటించిన సినిమాలో అవకాశాన్ని అందుకుంది.

ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

,/br>ప్రస్తుతం బుల్లితెర లో కూడా అవకాశాలు అందుకుంటుంది.బుల్లితెర లో స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ అనే ప్రోగ్రాం లో కూడా చేస్తుంది.

అందులో మరో కమెడియన్ తో కలిసి బాగా రచ్చ రచ్చ చేస్తూ ప్రేక్షకుల నుండి మరింతగా దృష్టిని అందుకుంటుంది.ఇక తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో తన మాటలు వింటేనే అర్థమవుతుంది.

Advertisement

పవన్ పై ఇష్టాన్ని, అభిమానాన్ని పీకల మీద వరకు పెంచుకున్న అషు ఆయన పేరును ప్రైవేట్ పార్ట్ లో టాటూ వేయించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.గతంలో ఆయన తో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంది.అంతేకాకుండా ఇటీవలే మరోసారి పవన్ కళ్యాణ్ ను కలిసిన ఈ బ్యూటీ నా దేవుడిని మరోసారి కలిశానంటూ తనకు టి ఆఫర్ కూడా ఇచ్చారని, తనకు ఓ లెటర్ కూడా ఇచ్చారని కూడా తెలిపింది.

అంతేకాకుండా ఓ నెటి జన్ ఆయనకు నాలుగో భార్య గా ఉంటావా అని అడగగా వెంటనే అవును అని కూడా సమాధానం చెప్పగా మరింత హాట్టాపిక్ గా మారింది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసుకోగా ఈసారి పవన్ కళ్యాణ్ ఫోటో నే పెట్టుకుంది.

ఆమె తన చేతి పై పెట్టుకున్న స్మార్ట్ వాచ్ లో గతంలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకొని ఈసారి అతనిపై ఇష్టాన్ని ఈ రకంగా చూపించింది.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారగా మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు