ఆచార్యలో విలన్ గా అరవింద్ స్వామికే పట్టం

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

లాక్ డౌన్ కంటే ముందుగానే షూటింగ్ ప్రారంభమైన కరోనా ఎఫెక్ట్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది.ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అయ్యాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమా కంటెంట్ ఎలివేట్ చేసే విధంగా ఉంది.

అపజయం అంటూ లేకుండా వెళ్తున్న కొరటాల కెరియర్ లో ఈ సినిమా ద్వారా మరో హిట్ పడటం పక్కా అనే మాట వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెగా తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తూ ఉండటంతో ఈ సినిమా మల్టీ స్టారర్ గా మారిపోయింది.

Advertisement

తండ్రి, కొడుకుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.

దానికి తగ్గట్లే బాలీవుడ్ నటుడుని ఇందులో విలన్ గా తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేశాడు.అయితే అది వర్క్ అవుట్ కానట్లు ఉంది.

ఇక ఇందులో సోనూసూద్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.మెయిన్ విలన్ పాత్ర కోసం మాత్రం ధృవ సినిమాతో స్టైలిష్ విలన్ గా అందరిని మెప్పించిన అరవింద్ స్వామిని ఈ సినిమాలో విలన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా కన్ఫర్మ్ చేయనున్నట్లు సమాచారం.అలాగే ఈ షెడ్యుల్ షూటింగ్ లో వచ్చే నెల నుంచి అతను కూడా భాగం అవుతాడని తెలుస్తుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

అరవింద్ స్వామి ఈ సినిమాలో విలన్ గా నటిస్తే సినిమాకి ఆ రకంగా కూడా కొంత హైప్ వస్తుంది.

Advertisement

తాజా వార్తలు