అర్జీలు సకాలంలో పరిష్కరించాలి

కలెక్టర్ అనురాగ్ జయంతి ఐడీఓసీలోని ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం.రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి అర్జీలు ( Public appeals )సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు.ప్రజావాణిలో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.రెవెన్యూ శాఖకు సంబంధించి 22, డీపీఓకు 4, సిరిసిల్ల మున్సిపల్, హౌసింగ్, ఉపాధి కల్పన కార్యాలయాలకు 2 చొప్పున, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ రూరల్ ఎంపీడీవో కార్యాలయాలకు, ఎక్సైజ్ శాఖకు ఒకటి చొప్పున అర్జీలు వచ్చాయి.

మొత్తం 36 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జెడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, వేములవాడ ఆర్డీఓ మధుసూదన్, ఎస్డీసీ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News